మనవి

మిత్రులారా...

ఈ పద నివేశ స్థలములో పొందు పరచబడిన ఏ కవితా ఎవరిని ఉద్దేశించినది కాదు. ఇందు పొందు పరచబడిన ఒక పదము వల్ల కాని లేక ఒక కవిత వల్ల కాని ఎవరేని హృదయము నొచ్చుకున్నా లేక బాధించబడ్డ వారి యొక్క విమర్శకు నేను సదా వినమ్రుడను కాని బాధ్యుడను కాను.

ఇట్లు
మీ అనిల్ కుమార్ శర్మ చింతలపల్లి

21, ఆగస్టు 2010, శనివారం

నీవెవరు

శ్వాశ నడిగా నీవెమిటని...
గమ్యమెరుగని గాలిని చెరదీసె చెలికాడిని నేనంది.
చూపుని అడిగా నీవు ఎవరని...
నీవు చూసే ప్రతిరూపు నేనంది.
మాటనడిగా నీ పనిఎంటి అని...
ఎల్లలేరుగని స్నేహ బంధానికి యజమాని నేనంది.
చేతినడిగా నీ గొప్ప ఎంటని...
ఊతమడిగిన సహ హృదయానికి చేసె ఉపకారమె నాగొప్పంది.
అడుగునడిగా నీ పొగరు అసలేమిటని...
ఖ్యాతికెక్కిన జాతిధనుల ననుసరించే భాగ్యం నాది మాత్రమేనని అంది.
ఊహనడిగా నీకెందుకంత ఉలుకని...
జగతి హృదయాలను ఏలు భారత జాతి ప్రాభవాన్ని ఊహిస్తున్నందుకంది.
మనస్సు నడిగా అంబరమంటే సంబరమెందువల్లనని...
భరతమాత బిడ్డననే తలపులు నను తాకుతున్నందువల్లనేనంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి